Home Blogs పితృ దోషాలు- పరిహారములు పార్ట్ -4

పితృ దోషాలు- పరిహారములు పార్ట్ -4

by gargeyaastro

పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 9348632385
జాతకాలలో జన్మ లగ్నం నుంచి నవమ స్థానాన్ని తండ్రి స్తానం లేదా పితృ స్తానం లేదా అదృష్ట స్తానం లేదా భాగ్య స్తానం అంటారు. ఈ స్తానం లో దోషము ఏర్పడితే ,దానిని నవమ స్థాన దోషం లేక పితృదోషం లేదా అదృష్టదోషం అంటారు.
పితృదోషం అనగానే భయపడేవారు సంఖ్య ఎక్కువ. ఎందుకంటే మరణించినవారి నుంచి దోషాలు ఆపాదించి వుంటాయేమో ననే భయంతో ఉంటుంటారు .నూటికి కేవలం 5%మాత్రమే మరణించిన వారి నుంచి దోషాలు ఆపాదింపబడును .మిగిలిన 95% జాతకాలలో వ్యతిరేక గ్రహస్తితుల కారణంగానే అదృష్టస్థానంలో దోషాలు వస్తుంటాయి .
ఒక వ్యక్తి జీవించి ఉన్నవుడు తన దుస్తులను ఏ విధంగా మార్చుకుంటాడో ,అదే విధంగా ఓ వ్యక్తి మరణించగానే ,తన ఆత్మ శరీరంనుంచి వెళ్ళిపోయి మరొక శరీరంలోకి ప్రవేశించి ఇంకో జననం జరుగునని భగవద్గీత లో గీతా చార్యులు చెప్పారు. మరణించిన వ్యక్తికి మోక్షం కలగాలని తమ వారు కర్మకాండలు ఆచరిస్తారు ఒక్కోసారి కర్మకాండలు జరగకుండా కూడా ఉంటుంటాయి ఉదాహరణకు కోవిద్ సమయంలో లక్షలాదిమంది చనిపోయారు . అత్యధిక భాగం కర్మకాండ చేయకుండానే ఉండిపోయారు .అలాగే కొన్ని కొన్ని దుర్మరణాలు జరుగుతున్న సందర్భాలలో కూడా కర్మకాండలు జరగనందున ,శరీరంలో ఉండే ఆత్మ ప్రేతగా మారును .ఇలాంటి ప్రేతలు తమ వారి కోసంగా తిరుగుతుంటాయి ఈ సందర్భాలలో ఆ ప్రేతల వలన వచ్చే దోషాలను పితృదోషాలని పిలుస్తారు.
ఎవరికైతే కర్మకాండలు మరణించిన సమయంలో జరగకుండా వుంటాయో ,అలంటి వారి కొరకుగా నారాయణ నాగబలి అనబడే శాంతి కార్యాన్ని ఆచరిస్తారు. ఆరోగ్యం కావాలంటే సూర్యారాధన చేయాలి. ఐశ్వర్యం కావాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి.అదే విధంగా ఓ వ్యక్తికి మోక్షం కలగాలంటే విష్ణువుని ప్రార్ధించాలి .అందుకే మరణించిన వ్యక్తియొక్క ప్రేతకు మోక్షం కలగటానికి నారాయణ నాగబలిని నిర్వహిస్తారు.
అయితే ప్రస్తుత రోజులలో ఎవరికైనా పితృదోషం ఉందనగానే తక్షణమే ఆ వ్యక్తి ని నారాయణ నాగబలి కార్యాన్ని చేయించుకోమని సలహాలిచ్చే పండితులు ప్రస్తుత రోజులలో ఉన్నారు .వాస్తవానికి బ్రతికి ఉన్నవారెవరికి నారాయణ నాగబలి ని జరిపించరు .కేవలం మరణించిన వారికీ మాత్రమే నారాయణ నాగబలి కార్యాన్ని ఆచరిస్తారు .ఏ వ్యక్తి వలన పితృదోషం ఏర్పడిందో తెలుసుకోవటం కష్టసాద్యం .అ లాంటి పరిస్థితులలో ……దోషం పట్టి బ్రతికి ఉన్న వ్యక్తే తన పేరుతో నారాయణ నాగబలి కార్యాన్ని చేయించుకోకూడదు ..ఆలా చేయించుకుంటే ఇంకా సమస్యలు పెరుగునే తప్ప తరగవు .

ఇది ఇలా ఉండగా మరికొందరు పండితులు పితృదోషం వున్నదనగానే ,వెంటనే ఆశ్రేష శాంతి కార్యాన్ని ఆచరించమని సలహాలిస్తారు అసలు ఆశ్రేషబలి అంటే అర్ధమే తెలియని వారందరు ……ఆశ్రేషబలి ని జరిపించడని సలహాలివ్వడం విడ్డురం.అసలు జాతకంలో ఆశ్రేషబలి అనగా ఏమిటో తెలుసుకుందాం .
కర్కాటకరాశి కుజ గ్రహానికి నీచస్థానంగా ఉంటుంది .ఎవరి జాతకంలోనైనా కుజగ్రహం కర్కాటకరాశి లో ఆశ్రేష నక్షత్రం లో ఉండాలి. దీనితోపాటు ఆ జాతకం లో కుజ గ్రహానికి కుటుంబ స్థాన ఆధిపత్యంగాని ,సంతాన స్థాన ఆధిపత్యం గాని ,వివాహస్థాన అధిపత్యంగాని వచ్చి ఉంటేనే ఆశ్రేషాబలి కార్యాన్ని ఆచరించాలి. ఈ కోణంలో లెక్కిస్తే మీన, వృషభ ,కర్కాటక ,తుల .ధనుర్లగ్నాలలో జన్మించిన వారికీ మాత్రమే ….కర్కాటకరాశిలో కుజుడు ఆశ్రేష నక్షత్రం లో సంచారం ఉంటేనే ఆశ్రేషబలి కార్యాన్ని ఆచరించాలి .

అంతే తప్ప కేవలం వివాహం కాని ఆశ్రేష జాతకులకు లేదా వివాహ సమస్యలను ఎదుర్కొనె ఆశ్రేష జాతకులకు….ఆశ్రేషాబలి కార్యాన్ని జరిపించడం తగదు .

కనుక పితృదోషాలు ,నాగదోషాలు, ఇతర వ్యతిరేక గ్రస్థితుల కారణంగా సమస్యలనేవి వస్తుంటాయి .అసలు పై దోషాల కారణంగా కెరీర్ డెవలప్ కాకపోవటం,సరైన సమయంలో ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడటము , అసలు ఉద్యోగం లేకుండా ఉండటం ,వ్యాపారం నష్టాల్లో ఉండటము . వివాహ ప్రయత్నాలు విఫలం కావటం ,వివాహం అయితే దాంపత్యసమస్యలు పెరగటం , కోర్ట్ లలో వేసినను విడాకులు మంజూరు కాకపోవటం ,సంతాన సమస్యలు,ఆర్ధిక సమస్యలు ,రక్తసంబంధీకులతో సమస్యలు ,ఋణ భాదలు పెరగటం ,శత్రువులు రెచ్చిపోవటము ,చేసే కార్యలలో అపజయాలు భాగస్వామ్య సమస్యలు ,గృహం కొరకు స్థలం కొనుగోలు చేస్తే కబ్జా కావటం,కుటుంబం లో మనస్పర్థలు, సంతానం వృద్ధి లేకపోవటం ,ఒకే గృహం లో పలువురికి వయసు పెరిగినను వివాహాకాకపోవటం.వీటితో పాటు మానసిక,శారీరిక సంఘర్షణలు ఇంకా ఇంకా ….చెప్ప నలవికాని సమస్యలు ఎన్నో పై దోషాలవలన వస్తుంటాయి .
ఇన్ని రకాల సమస్యలు ఉన్నపుడు ,ఎవరికీ తోచిన పరిహారాలు వారు చేసుకుంటుంటారు .కానీ ఇన్ని సమస్యలు ఉన్నపుడు ఒకరోజులోనే ఆచరించే నారాయణ నాగబలి ,ఆశ్రేషాబలి కార్యాలకు వేలాది రూపాయలను వెచ్చించి పరిహారాలు కూడా చేసుకునేవారు ఎందరెందరో ఉన్నారు.కానీ పితృదోష నివారణ ఒకరోజుతో ముగిసే క్రతువు కాదు .ఈ క్రతువును ఒక నెల కు 9 రోజులు చెప్పున 11నెలలకు 99 రోజులు ఆచరించాలి .ఇలా చేస్తేనే పితృదోషాలలో ఉన్న వందలకొద్దీ కంబినేషన్లచే వచ్చే సమస్యలకు ఉపశాంతి ఏర్పడును.
ఒకరోజు ఆచరించే నారాయణ నాగబలి వంటి కార్యాలకు సుమారు 15000 రుపాయలు ఖర్చు ఉంటే ,99 రోజులు చేసే శాంతి కార్యాలకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అగునోననే అనుమానం చాల మందికి వస్తుంది.నిజానికి చెప్పాలంటే 99రోజుల సాగె ప్రత్యేక హోమాలకు ప్రత్యేక పద్దతిలో కేవలం 11000 రూపాయల తోనే ప్రత్యేక పీఠం లో జరుపబడును .మరి ఈ 99రోజుల హోమ శాంతి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి ?ఏ ఏ రోజులలో చేయాలి?మొదలైన అంశాలపై 5వ భాగం లో తెలుసుకుందాం
పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 9348632385

You may also like

Leave a Comment