Home Blogs పితృదోషాలకు 99రోజుల పరిహార శాంతులు పార్ట్ -5

పితృదోషాలకు 99రోజుల పరిహార శాంతులు పార్ట్ -5

by gargeyaastro

శ్రీనివాస గార్గేయ 9348632385
జాతకాలలో లగ్నం నుంచి నవమ స్తానంగా చెప్పబడే పితృస్థానము లేక తండ్రిస్తానము లేక భాగ్యస్థానము లేక అదృష్టస్థానములో దోషాలున్నపుడు, వాటిని పితృదోషాలంటారు .నూటికి 3నుంచి 5శాతం వరకు మాత్రమే మరణించిన పెద్దల ఆత్మలకు శాంతి కలగని కారణంగా పితృదోషాలు వస్తుంటాయి.మిగిలిన 95 నుంచి 97శాతం వరకు మరణించిన పెద్దల వలన దోషాలు రాకుండ కేవలం జాతకుల వ్యక్తిగత జాతకాలలో ఇతర వ్యతిరేక గ్రహస్తితుల వలన కూడా పితృదోషాలు వస్తుంటాయి .ఇవి వందలకొద్ధి కాంబినేషన్ లు ఉన్నవని గ్రహించాలి .
ఇక పితృదోషాల ప్రభావం అష్టమ ,అర్దాష్టమ ,ఏలినాటిశని పీరియడ్స్ లోనూ …… శని రాహు కేతు మహా దశలల్లోను అంతర్దశల్లోనూ వ్యతిరేక ఫలితాలు ఇచ్చును .ఇందుకొరకుగా ఉపశాంతి పొందుటకై ప్రత్యేక పద్దతిలో ప్రతి నెలలో 9 రోజుల పాటు శాంతి కార్యాలు చేయాలి .ఈ విధంగా 11 నెలల పాటు ఆచరించాలి. అంటే మొత్తం 99రోజులు ఆచరించాలన్నమాట.
ప్రతినెలలో పూర్ణిమ ,అమావాస్య మధ్యలోనే 9రోజుల కార్యక్రమం జరుగును .ఒక సోమవారం తో ప్రారంభమై ……..మంగళ బుధ ,గురు, శుక్ర ,శని ,ఆదివారాలలో …. 7 రోజులు జరుగును .ప్రతి రోజు ఉన్న వారానికి అధిపతి ఏ గ్రహమగునో ,ఆ గ్రహానికి తగిన రీతిలో శాంతి పరిహార హోమం జరుగును. అనగా 7 రోజులలో చంద్ర,కుజ,బుధ,గురు,శుక్ర,శని రవి గ్రహాలకు పరిహార హోమం జరుగును. ఇక మిగిలినది రాహు కేతువులు మాత్రమే ..
తరువాత సోమవారం నాడు ఉదయం 7 గంటల 30 నిముషాల నుంచి 9 గంటల వరకు వుండే రాహుకాలం లో రాహు సంబంధ హోమ శాంతి జరుగును. అలాగే అదేరోజు ఉదయం 10గంటల 30 నిమిషాల నుంచి 12 గంటలవరకు వుండే యమగండ కాలం లో కేతు గ్రహానికి హోమ శాంతి జరుగును. ఇంతటితో నవగ్రహాలకు కార్యక్రమాలు ముగియును. ఇక మిగిలిన 9వ రోజు కార్యక్రమం అమావాస్యరోజున జరుగును . అయితే సోమవారము ,మరియు అమావాస్య ఒకేరోజు వచ్చే సందర్భాలు కూడా అప్పుడపుడు ఉంటాయి .ఇలాంటి సందర్భాలలో సోమవారం నాటి రాహు కేతువుల హోమ శాంతులు మరియు అమావాస్య నాటి హోమ శాంతి ఒకేరోజున జరుగును. ఇలా వచ్చిన సందర్భాలలో కేవలం 8 రోజులలోనే ,ఆమాస క్రతువులు ముగియును .
పితృ దోషాలకు 99రోజుల పాటు చేయవలసిన పరిహార హోమశాంతి కార్యాలను ….. పితృదోషం, ప్రారబ్దదోషం నాగదోషం,ఆశ్రేష బలి మొదలయినవి ,ఏ వ్యక్తికి ఉండునో …..వారి జన్మ నక్షత్ర,జాతక గ్రహస్థితులను, 3 ప్రత్యేకమైన ఆకులలో లిఖించి ,36 కలశాలతో ,ప్రతినెలలో 9 రోజులు జరిగే విధంగా 11నెలలగాను 99రోజులు హోమశాంతి కార్యములు నిష్ణాతులైన పండితులతో సామూహికంగా ప్రత్యేకపీఠం లో నిర్వహించబడును .
ఈ 11మాసాలలో ,ఎప్పుడైనా అమావాస్య సోమవారం కలిసి వస్తే ఒకరోజు తగ్గును .ఈ పరంపరలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర నిజ శ్రావణమాసం నుంచి రాబోయే శ్రీ క్రోధి నామ సంవత్సర జేష్ఠ మాసం వరకు గల 11నెలలలో రెండుసార్లు సోమవారం అమావాస్య వచ్చినవి .అందువలన 99రోజులకు బదులుగా 97రోజులు మాత్రమే హోమశాంతి కార్యక్రమములు జరుగును . పై విధంగా 97రోజులు 11మాసాలలో ఏ ఏ తేదీలలో జరుగునో …6వ భాగం లో వివరించబడును .ప్రజా శ్రేయస్సుకొరకుగా అతి తక్కువ ఖర్చుతోనే 97రోజుల కార్యక్రమం జరుగును ..97రోజుల హోమశాంతి కొరకుగా ఒకరికి అయ్యే మూల్యం 11000రూపాయలు మాత్రమే.
ఈ 99రోజుల కార్యక్రమములు ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్ లో లైవ్ స్ట్రీమింగ్ గా ప్రసారం జరుగును. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోరిక మేరకు ఈ కార్యక్రమాలు అన్నియూ దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ గారి సారధ్యంలో జరుగును ..

You may also like

2 comments

Avatar
Priyanka August 19, 2023 - 9:04 am

Ayyagaru jathakam chusthara

Reply
Avatar
gargeyaastro October 29, 2024 - 10:51 am

yes mam

Reply

Leave a Reply to gargeyaastro Cancel Reply